తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల బీజేపీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పై ఓ రేంజ్లో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ సర్కార్ను గద్దె దించుతామని, మోదీని తరిమేస్తామని కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యల పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేసీఆర్ కామెంట్స్ పై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షడు సోము వీర్రాజు నోరు అదుపులో పెట్టుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బీ కేర్ ఫుల్ కేసీఆర్ రాష్ట్రంలో మీ కుటుంబ పాలన, మీ గులాబీ గ్యాంగ్ మోసాలు ప్రజలకు వివరిస్తామని, సోనియా గాంధీకి సాష్టాంగ నమస్కారం చేసే నీకు మోదీ పై విమర్శలు చేసే అర్హత ఉందా అని సోము వీర్రాజు, కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. మరి సోము వీర్రాజు వ్యాఖ్యల పై టీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.