Hyderabad : హైద‌రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

హైద‌రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎం సంజీవ్..

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 09:46 PM IST

హైద‌రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎం సంజీవ్ (31) శనివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. అయితే అకస్మాత్తుగా అసౌకర్యానికి గురై నేలపై కుప్పకూలిపోయాడు. సంజీవ్‌ని స్నేహితులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.