Smriti: స్మృతి మంధాన చేసిన పనికి ఫాన్స్ ఫిదా!

జెంటిల్ మెన్ గానే క్రికెట్ లో హుందాగా వ్యవహరించే వారు చాలా అరుదుగా కనిపిస్తారు.

  • Written By:
  • Updated On - March 13, 2022 / 07:40 PM IST

జెంటిల్ మెన్ గానే క్రికెట్ లో హుందాగా వ్యవహరించే వారు చాలా అరుదుగా కనిపిస్తారు. మహిళల క్రికెట్ ను జెంటిల్ వుమెన్ గేమ్ గా భావిస్తే అందులో కూడా హుందాగా వ్యవహరించే వారు కూడా తక్కువే. అయితే ఇతర దేశాల మహిళా క్రికెటర్ల తో పోలిస్తే మంచి వ్యక్తిత్వం ఖచ్చితంగా భారత ప్లేయర్స్ కే ఉంటుందని మరోసారి రుజువైంది. తాజాగా మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెంచరీతో చెలరేగిన టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాననే దీనికి ఉదాహరణ. ఆమె చేసిన పనికి ఫిదా అయిన ఫాన్స్ లవ్ యూ స్మృతి అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే సెంచరీ చేసి విజయంలో కీలక పాత్ర పోషించినదాని కంటే.. మ్యాచ్ అనంతరం మంధాన చేసిన పని ఈ ప్రశంసలకు కారణం.

అసలు సంగతి ఏమిటంటే స్మృతి మంధాన(119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 123), హర్మన్‌ప్రీత్ కౌర్(107 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109)సెంచరీలతో కదం తొక్కారు. 78 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును వీరిద్దరు ఆదుకున్నారు. సూపర్ బ్యాటింగ్‌తో నాలుగో వికెట్‌కు 184 పరుగులు జోడించి భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే హయ్యెస్ట్ స్కోర్‌గా నిలిచిన స్మృతి మంధానకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించగా.. ఆమె దాన్ని హర్మన్‌ప్రీత్‌తో కలిసి పంచుకుంది. ఇతరుల క్రెడిట్‌ను తమదని చెప్పుకునే ప్రస్తుత రోజుల్లో స్మృతి మంధాన తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను సహచర ప్లేయర్‌తో పంచుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మంధాన గొప్ప మనసును కొనియాడుతున్నారు. ఇద్దరం కలిసే భారీ స్కోర్‌కు బాటలు వేసామని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇద్దరికి దక్కాలని ఈ సందర్భంగా స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. సెంచరీ చేసిన తర్వాత కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాకుంటే అది ఏ మాత్రం బావ్యం కాదనేది నా ఫీలింగ్. మా టీమ్ 300 ప్లస్ రన్స్ చేయడంలో మేం ఇద్దరం కీలక పాత్ర పోషించాం. సమానంగా రాణించాం. కాబట్టి ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇద్దరికి దక్కాలి. అందుకే ఈ ట్రోఫీని హర్మన్‌తో కలిసి పంచుకోవాలనుకుంటున్నా అని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది. స్మృతి నీది గొప్ప మనసు అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.