Site icon HashtagU Telugu

Road Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

Mexico Bus Crash

Road accident

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో సోమవారం ఒక్క రోజే మూడు రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగాయి. నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారిపై జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. తాజాగా ఓ ఆటో .. కంటైనర్‌ ట్రక్కు చక్రాల కిందకు రావడంతో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం (బ్లాక్) మైనూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి 161పై ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మైనూర్‌ నుంచి బిచ్‌కొండ వైపు రాంగ్‌ రూట్‌లో వస్తున్న ఆటో హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌ వైపు వెళ్తున్న కంటైనర్‌ లారీ కింద పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు.ఈ ప్ర‌మాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version