BRS: గులాబీ గూటికి సీతారాంపురం గ్రామ మిత్ర యూత్ నాయకులు

సీతారాంపురం గ్రామానికి చెందిన బిజెపి యువజన నాయకులు, మిత్ర యూత్ సభ్యులు బి అర్ ఎస్ పార్టీ లో చేరారు.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 05:37 PM IST

పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన బిజెపి యువజన నాయకులు, మిత్ర యూత్ సభ్యులు బి అర్ ఎస్ పార్టీ లో చేరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బుధవారం వారు గులాబీ కండువాలు కప్పుకున్నారు. వారిని బిఆర్ఎస్ పార్టీలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో జి. శ్రీనివాస్, డి. అఖిల్, జి. రాకెష్, సిహెచ్. అఖిల్, జి. శ్రీకాంత్, ఏ. శ్రీకాంత్, వి. విజయ్, ఏ. నవీన్, జి. ప్రదీప్, ఏ. ప్రదీప్, ఏ. సందీప్, జి. నవీన్తదితరులు ఉన్నారు.

రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ, నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి కి ఆకర్షితులమై తాము ఈ పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి విజయం కోసం కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బస్వ మల్లేష్, గ్రామ సర్పంచ్ రెడ్డి రాజుల రమేష్, మండల నాయకులు పల్లా సుందర్ రాం రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ సింగ్, మండల ప్రధాన కార్యదర్శి చింత రవి, కోతి ప్రవీణ్, యాకూబ్ పాషా, విరన్న, అంజయ్య, కొత్త జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.