3 Killed : బ్రెజిల్‌లో రెండు పాఠ‌శాల‌ల్లో కాల్పులు.. ముగ్గురు మృతి, ఎనిమిది మందికి గాయాలు

బ్రెజిల్‌లోని ఎస్పిరిటో శాంటోలో రెండు పాఠశాలలపై ఒక షూటర్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.....

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 08:10 AM IST

బ్రెజిల్‌లోని ఎస్పిరిటో శాంటోలో రెండు పాఠశాలలపై ఒక షూటర్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని విటోరియాకు ఉత్తరాన 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణమైన అరక్రూజ్‌లో ఈ కాల్పులు జ‌రిగిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సైనిక దుస్తులు ధరించిన ఒక యుక్తవయస్కుడు రెండు పాఠశాలలపై కాల్పులు జరిపి పారిపోయిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో కాల్పులు జ‌రిపింది పాఠ‌శాలోని విద్యార్థిగా పోలీసులు తొలుత భావించారు. అయితే త‌రువాత గుర్తుతెలియ‌ని వ్య‌క్తి కాల్పులు జ‌రిపిస‌ట్లు పోలీసులు తెలిపారు.