BRS: నల్లగొండ బీఆర్ఎస్ లో చిచ్చు.. గాదరి కిశోర్ పై గుత్తా అనుచరుల సంచలన వ్యాఖ్యలు

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 01:10 PM IST

BRS: నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అనుచరులు మీడియా సమావేశం నిర్వహించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పైన సంచలన ఆరోపణలు చేశారు . జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పైన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిజ్ఞానం కలిగిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి గాని, వయస్సు గాని లేని చిల్లర వ్యక్తి గాదరి కిషోర్ అని అన్నారు.

ఒక ఉపాద్యాయుని కొడుకై ఉండి కనీసం వయసులో తన తండ్రి కన్నా పెద్దవాడిని గౌరవించే కనీస సంస్కారం లేని నీచుడు కిశోర్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటిలో వేలాది మంది చేసిన ఉద్యమాలను ఆయనే చేసినట్లు తన ఖాతాలో వేసుకొని, తన వెంట నడిచిన స్నేహితులను సైతం నిలువునా ముంచింది ఎవరికి తెలియదా ?ఉద్యమ కారుడినని, ఆ కోటాలో MLA టికెట్ తెచ్చుకొని, MLAగా గెలిచి నీ తుంగతుర్తి ప్రాంతానికి నువ్వు చేసింది ఏమి లేదు . ప్రజలకు ని చరిత్ర అంత తెలుసు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడించి ,తరిమికొట్టారన్నారు కేవలం ఇసుక దందానీ వృత్తిగా మార్చుకొని వందల కోట్లు సంపాదించిన ప్రబుద్ధిడన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయములో, ఉధ్యమం పేరు చెప్పుకొని రాజకీయ నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి చందాలు వసూలు చేసి ని సొంతానికి వాడుకున్నా చిల్లరగాడని అన్నారు. అలాగే కనగల్ జడ్పిటిసీ చిట్ల వెంకటేశం , బి ఆర్ యస్ పార్టీ సీనియర్ నేతలు ఐతగోని స్వామి గౌడ్ , అనీష్ , మాట్లాడుతూ ” ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ పతనానికి ప్రదాన కారుకుడివే కిషోర్ నని, అధికారులను వేధించి వసూళ్ళు చేసిండని ఆరోపించారు. మహిళ లోకల్ బాడీస్ లోని మహిళా ప్రజా ప్రతినిధులను మరియు మహిళా కార్యకర్తలపై నీ అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపులు వాస్తవము కాదా ? అదేవిధంగా పార్టీల్లో పలు పదవులను అమ్ముకున్న ఘనత గాదర్ కిషోర్ కే వర్తిస్తుందన్నారు.