కర్ణాటకలోని హుగ్లీ నదిలో వంతెనపై నుంచి దూకి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి తన మోటారు సైకిల్ను వివేకానంద సేతుపై నిలిపి, రెయిలింగ్పైకి ఎక్కి దూకాడు. ఈ సంఘటన శనివారం ఉదయం 7:45 గంటలకు జరిగింది. నదిలోకి దూకిన వ్యక్తి కోసం రోస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వ్యక్తి సీల్దా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది, కోల్కతా వ్యక్తిగా గుర్తించారు. కోల్కతా పోలీసుల విపత్తు నిర్వహణ బృందం సిబ్బంది ఆ వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బ్రిడ్జి వద్ద బైక్ను స్వాధీనం చేసుకుని.. వ్యక్తిని గుర్తించామన్నారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతుడు తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్నాడని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారుఉ.