తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో అన్నీ పరీక్షలు నిర్వహించారు. ఈ మధ్యే వాటి రిజల్ట్స్ కూడా విడుదల అయ్యాయి. ఈనెల నుంచి పాఠశాలలను పున:ప్రారంభించారు. ఏపీ విషయానికొస్తే..2022-2023 విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యింది. జూలై 5 నుంచి 2023 ఏప్రిల్ వరకు పాఠశాలలు జరగనున్నాయి.
అయితే ప్రతి రెండో శనివారం సెలవు దినంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవు రోజుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని…ఈ మేరకు అన్ని పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు తప్పక పాటించాలని సూచించింది. ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించినట్లయితే.. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.