Site icon HashtagU Telugu

Encounter Report: సుప్రీం కోర్టుకు చేరిన దిశ ఎన్ కౌంట‌ర్ నివేదిక‌

హైదరాబాద్‌లోని సంచ‌ల‌నం సృష్టించిన వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ అత్యాచారం,హ‌త్య కేసులో ఎన్ కౌంట‌ర్ పై నివేదిక సుప్రీంకోర్టుకు చేరింది. ఈ హత్యకేసులో నలుగురు నిందితులు మహ్మద్‌ ఆరీఫ్‌, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ల ఎన్‌కౌంటర్‌పై విచారణకు 2019లో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ వీఎస్‌ సిర్‌పుర్కర్‌ కమిషన్‌ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఎన్‌కౌంటర్‌పై ఆగస్టు 21, 201 నుంచి నవంబర్ 15, 2021 వరకు 47 రోజుల పాటు విచారణ జరిపేందుకు డిసెంబర్ 12, 2019న నియమించిన కమిషన్ 57 మంది సాక్షులను విచారించి నివేదికను సమర్పించిందని కమిషన్ కార్యదర్శి ఎస్ శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం రోజు ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన దర్యాప్తు రికార్డులు, ఫోరెన్సిక్ నివేదికలు, పోస్ట్‌మార్టం నివేదికలు, ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలను ఈ నివేదిక కలిగి ఉంది.

ఈ ఘటనలో పాల్గొన్న పోలీసు అధికారులు, న్యాయవాదులు తదితరులను కమిషన్ విచారించింది. డిసెంబరు 5, 2021న జరిగిన సంఘటనకు సంబంధించిన వివిధ ప్రదేశాలను కూడా కమిషన్ తనిఖీ చేసింది. జనవరి 2020న ఏర్పాటైన కమిషన్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ VS సిర్పుర్కర్, ఛైర్మన్‌గా, జస్టిస్ RP సొండూర్ బల్డోటా, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి , మాజీ సీబీఐ డైరెక్ట‌ర్ డాక్టర్ DR కార్తికేయన్ స‌భ్యులుగా ఉన్నారు.

హైదరాబాద్‌కు చెందిన వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ ని శంషాబాద్‌లోని తొండుపల్లి వద్ద టోల్‌ప్లాజా సమీపంలో కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసి, ఆమె మృతదేహాన్ని షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వంతెన కింద పడేసి కాల్చివేసిన విషయం తెలిసిం అనంతరందే, సుప్రీంకోర్టు నియమించిన కమిషన్‌ను ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా విచారణను పూర్తి చేయలేకపోయినందున విచారణ ప్యానెల్ పదవీకాలం మూడుసార్లు పొడిగించబడింది. చివరి పొడిగింపు ఆగస్టు 2021లో జరిగింది, విచారణ కమిషన్ నవంబర్ 16, 2021 నుండి నవంబర్ 26, 2021 వరకు న్యాయవాదులందరి నుండి మౌఖిక వాదనలు విన్నది.