తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఐదో రోజైన నేటి ఉదయం మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమాడ వీధుల్లో బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులకు వరాలు ప్రసాదించారు. మరోవైపు, విశిష్టమైన శ్రీవారి గరుడవాహనసేవ ఈ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. పెద్ద ఎత్తున భక్తులు పుణ్య క్షేత్రానికి చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీనివాసుడిని 64 వేల 277 మంది దర్శించుకున్నారు.
Also Read: Epuri Somanna: షర్మిల్ కు బిగ్ షాక్, బిఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న!