ప్రమోషన్స్ చెయ్యబోయి చిక్కుల్లో పడ్డ సాయి పల్లవి.. విరాటపర్వం హిట్టా?

టాలీవుడ్ హీరోయిన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

  • Written By:
  • Updated On - June 16, 2022 / 05:21 PM IST

టాలీవుడ్ హీరోయిన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సాయిపల్లవి కి యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే. మామూలుగా సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలకు వివాదాలకు దూరంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా నిలుస్తూ ఉంటుంది. సినిమాల విషయంలో సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రమే ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇకపోతే సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం విరాట పర్వం.

ఈ సినిమా ఈ నెల 17న విడుదల సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సాయి పల్లవి అలాగే చిత్రబృందం వరుసగా ఇంటర్వ్యూలకు హాజరు అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి, రానా విరాటపర్వం సినిమా లోని వెన్నెల పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ కొన్నిరోజుల క్రితం ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా విడుదలైందని ఆ సినిమాలో వాళ్లు ఎలా చంపారో చూపించారని దానిని మత సంఘర్షణలా చూస్తే బండిలో డ్రైవర్ ముస్లిం అయ్యి ఉండి బండిలో ఆవులు ఉంటే అతనిని కట్టేసి జై శ్రీరామ్ అనాలని చెబుతున్నారని అని తెలిపింది.

అయితే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి తేడా ఏమి ఉందని ఆమె కామెంట్స్ చేసింది. అలాగే మనం మంచిగా ఉంటే ఇతరుల్ని ఇబ్బంది పెట్టమని తెలిపింది సాయిపల్లవి.అయితే ఈ విషయంలో సాయి పల్లవిని కొంతమంది సపోర్ట్ చేస్తుండగా ఇంకొందరు ట్రోల్స్ చేస్తున్నారు. సాయిపల్లవి కామెంట్ల వల్ల తాము విరాటపర్వం సినిమాను చూడమని మరి కొందరు తేల్చి చెబుతున్నారు. మరి ఈ విషయంపై సాయి పల్లవి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.