తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలైయ్యాయి. కారు హైదరాబాద్ నుంచి తిరుమలకు వస్తుండగా మామండూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులను నగేష్ (47), శ్రవణ్ కుమార్ (25)గా గుర్తించారు. గాయపడిన అపర్ణ, స్వాతి, సంజన, లక్ష్మీ నారాయణ, రాధికలను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.