Road Accident : శంషాబాద్‌లో రోడ్డు ప్ర‌మాదం.. కాంగ్రెస్ నేత కుమార్తె మృతి

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్డు వద్ద ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

Published By: HashtagU Telugu Desk
Mexico Bus Crash

Road accident

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్డు వద్ద ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె తనియా మృతి చెందింది. తనియా తన స్నేహితుల‌తో కలిసి పార్టీకి వెళ్లి తిరిగి కారులో ఇంటికి వస్తుండగా..వారు ప్ర‌యాణిస్తున్న‌ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించిందని, మిగిలిన ముగ్గురికి గాయాలు అయిన‌ట్లు పోలీసులు తెలిపారు. త‌నియా మృత‌దేహాన్ని పోస్ట్‌మార్ట‌మ్ కోసం ఉస్మానియాకి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై స‌మాచారం తెలుసుకున్న ఫిరోజ్ ఖాన్ ఉస్మానియా మార్చురికి వ‌చ్చారు. త‌న కుమార్తె మృత‌దేహాన్ని చూసి బోరున విల‌పించారు.

  Last Updated: 01 Aug 2022, 08:40 AM IST