5 Killed in Road Accident : ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో

  • Written By:
  • Publish Date - August 8, 2022 / 02:13 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. కంబం సమీపంలో వేగంగా వస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కారులో వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు నుంచి తిరుపతికి వెళుతున్నారు. మృతులు హన్మిరెడ్డి (60), గురవమ్మ(60), అనంతమ్మ(55), ఆదిలక్ష్మి(58), నాగిరెడ్డి (24) గా గుర్తించారు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.