Site icon HashtagU Telugu

Road Accident : బాపట్లలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

Mexico Bus Crash

Road accident

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. జిల్లాలోని వేమూరు మండలం జంపని గ్రామం వద్ద సోమవారం టాటా ఏస్ వాహనం బోల్తా పడడంతో అయ్యప్ప స్వామి భక్తులు నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ప‌ది మంది భక్తులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల నుంచి తెనాలి టౌన్‌కు తిరిగి వచ్చి అక్కడి నుంచి టాటా ఏస్ వాహనంపై వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. వాహనం జంపని గ్రామం వద్దకు రాగానే ర్యాష్ డ్రైవింగ్, పొగమంచు కారణంగా వాహనం అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కృష్ణా జిల్లా పెడనకు చెందినవాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.