Revanth Reddy: వెళ్ళింది బీజేపీ ఎంగిలి మెతుకుల కోసమే: రేవంత్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం తెలంగాణ రాజకీయల్లో కాక రేపుతోంది.

  • Written By:
  • Publish Date - August 2, 2022 / 11:35 PM IST

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం తెలంగాణ రాజకీయల్లో కాక రేపుతోంది. ఊహించునట్లుగానే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకు గుడ్ బై చెప్పేశారు.

సీనియర్లు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. తాజాగా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో రాజగోపాల్ రెడ్డి పై మండిపడ్డారు.తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ఈడీ కేసులతో వేధిస్తున్నారన్నారు. తల్లిని వేధిస్తోన్న వారిపై పోరాడాల్సింది పోయి వారితోనే జత కడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని తెలంగాణ జాతి క్షమించదన్నారు. సోనియా గాంధీని ఈడీ విచారణ చేస్తుంటే రాజగోపాల్రెడ్డి కాంట్రాక్టులు కుదుర్చుకున్నారన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.తెలంగాణ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సమాజం నిశీతంగా పరిశీలిస్తోందని రేవంత్ అన్నారు. సిద్ధాంతాల ముసుగులో బీజేపీ చూపెడుతోందన్నారు. పార్లమెంట్ శాసన విధానాలనే కించ పరుస్తూ వ్యవహరిస్తున్నారన్నారు. నరేంద్ర మోదీని తెలంగాణ సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు.