Modi Rally : మోడీ ర్యాలీ స‌మీపంలో ఆర్డీఎక్స్’

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇటీవ‌ల జ‌మ్మూలో ర్యాలీ మార్గానికి స‌మీపంలో పేలుడు ప‌దార్థాల‌ను ఆల‌స్యంగా పోలీసులు గుర్తించారు.

  • Written By:
  • Publish Date - April 28, 2022 / 01:49 PM IST

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇటీవ‌ల జ‌మ్మూలో ర్యాలీ మార్గానికి స‌మీపంలో పేలుడు ప‌దార్థాల‌ను ఆల‌స్యంగా పోలీసులు గుర్తించారు. గ‌త ఆదివారం జమ్మూలోని ర్యాలీ వేదికకు సమీపంలో పేలుడు జ‌రిగిన‌ ప్రదేశంలో ఆర్‌డిఎక్స్ , నైట్రేట్ సమ్మేళనం ఉంద‌ని తేల్చారు. దీనిపై CFSL ద్వారా వివరణాత్మక నివేదిక కోసం వేచి ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని మోదీ ర్యాలీ జరిగే వేదికకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మూలోని లాలియానా గ్రామంలోని మైదానంలో పేలుడు సంభవించింది.ఆ పేలుడు ఉగ్రవాదానికి సంబంధించినదిగా అనుమానించ‌డంలేద‌ని తొలుత పోలీసులు వివ‌రించారు. ఆ త‌రువాత ఇప్పుడు పేలుడు ప‌దార్థాలు ఉన్నాయ‌ని తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. జమ్మూ డివిజన్‌లోని సాంబా జిల్లాలోని పల్లి పంచాయతీలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన గ్రామసభల్లో ఆయన ప్రసంగించారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లో రూ. 20,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. కొన్ని ప‌నుల‌కు శంకుస్థాపన చేశారు. ఇందులో బనిహాల్-ఖాజిగుండ్ రోడ్డు సొరంగం, ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్ వే మరియు రాట్లే మరియు క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి.