Rakul Preet Singh: రకుల్ ప్రీత్ తెలుగు సినిమాల్లో నటించదా? అసలు విషయం ఇదే!

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. అప్పుడెప్పుడో ఓ తెలుగు సినిమా చేసింది.

  • Written By:
  • Updated On - July 12, 2022 / 01:02 PM IST

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. అప్పుడెప్పుడో ఓ తెలుగు సినిమా చేసింది. ఆమె చివరిసారిగా చెక్, కొండపొలంలో 2020, 2021లో నటించింది. అయితే టాలీవుడ్‌లో ఆమె కనిపించకుండా పోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. తాను తెలుగు సినిమాల్లో ఎందుకు చేయడం లేదనే దాని గురించి రకుల్ ప్రీత్ సింగ్ ఓపెన్ కామెంట్స్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ఇంటరాక్టివ్ సెషన్‌లో రకుల్ ప్రీత్ సింగ్ తాను తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు అనే దాని గురించి క్లారిటీ ఇచ్చారు. “మీరు ఏదైనా తెలుగు సినిమా చేస్తారా లేదా మీరు హిందీ సినిమాలకు మాత్రమే చేస్తారా (ఏడుస్తున్న ఎమోజీ)” తో అడిగాడు ఓ అభిమాని.

నేను తెలుగు సినిమా చేస్తాను. విభిన్నంగా ఏదైనా చేయాలని, నిజంగా నన్ను సవాలు చేసే పాత్ర దక్కాలని ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాను అంటూ సమాధానమిచ్చింది ఈ బ్యూటీ. రకుల్ ప్రీత్ సింగ్ 2011లో కెరటం అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. కొన్నేళ్లలోనే నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (2013), లౌక్యం (2014), పండగ చేస్కో (2015), సరైనోడు (2016), ధృవ (2016), రారండోయ్ వేడుక చూద్దాం (2017), స్పైడర్ వంటి చిత్రాలతో ఆమె తెలుగు, తమిళంలో భారీ విజయాలను అందుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్ కమల్ హాసన్ భారతీయుడు 2 లో నటిస్తోంది. కానీ అనేక కారణాల వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ని మళ్లీ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆమె శివకార్తికేయన్‌తో అయాలన్ అనే తమిళ సినిమా కూడా చేసింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్నా సినిమా ఇంకా ఎందుకు ప్రేక్షకుల ముందుకు ఎందుకు రాలేదో తెలియదు. బాలీవుడ్‌లో, రకుల్ ప్రీత్ సింగ్‌ చేతిలో ఈ సంవత్సరానికిగాను మంచి బాలీవుడ్ చిత్రాలున్నాయి. ఆయుష్మాన్ ఖురానా, షెఫాలీ షాతో పాటు డాక్టర్ జి అనే సామాజిక నాటకంలో ప్రధాన మహిళగా నటిస్తుంది. ఈ సంవత్సరం దీపావళికి విడుదల కానున్న అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన ఇంద్ర కుమార్ కామెడీ చిత్రం థాంక్ గాడ్‌లో రకుల్ నటించింది.