Acid Attack : రాజస్థాన్లోని కరౌలి జిల్లాలో దారుణం జరిగింది..
కొంతమంది కీచకులు.. మోహనపుర గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి, యాసిడ్ దాడికి పాల్పడి హత్య చేశారు..
బుధవారం అదృశ్యమైన ఆ యువతి.. గురువారం రాత్రి విగత జీవిగా కనిపించింది.
ఆమె మృతదేహాన్ని పోలీసులు ఒక బావిలో గుర్తించారు..
Also read :Chandrayaan 3 Today : ఇవాళ మధ్యాహ్నం నింగిలోకి “చంద్రయాన్ 3”
ఈనేపథ్యంలో కరౌలి జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యువతి డెడ్ బాడీని(Acid Attack)పోస్ట్మార్టం కోసం కరౌలి జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకురాగా బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా సహా ఆ పార్టీ నాయకులు వచ్చి ఈ నిరసనలో పాల్గొన్నారు. దోషులను వెంటనే శిక్షించడంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. మృతిచెందిన యువతి కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం , ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. యువతిని కిడ్నాప్ చేసి హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రేప్ కూడా జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే .. అసలేం జరిగిందనే దానిపై క్లారిటీ వస్తుంది.