Mahatma Gandhi: మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

  • Written By:
  • Updated On - January 30, 2022 / 02:34 PM IST

మ‌హాత్మా గాంధీ  74 వ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఘ‌న నివాళుల‌ర్పించారు. రాజ్‌ఘాట్‌లోని మ‌హాత్ముని స‌మాధిపై పుష్ప గుచ్ఛం ఉంచి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఈ సంద‌ర్భంగా సైనికులు సంప్ర‌దాయ బ్యాండుతో మ‌హాత్మునికి అంజ‌లి ఘ‌టించారు.  ఆ తర్వాత ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ నివాళుల‌ర్పించారు. మ‌హాత్మ‌గాంధీ స‌మాధి చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేసిన ప్ర‌ధాని.. కొద్ది సేపు అక్క‌డే నిల‌బ‌డి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ప్రతిఒక్కరూ మహ్మతుడి బాటలో పయనించాలని వారు పిలుపునిచ్చారు.