Governors: కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. ప‌లు రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్లు!

కేరళ గవర్నర్‌గా రాజేంద్ర ఆర్లేకర్, మిజోరం గవర్నర్‌గా విజయ్‌కుమార్ సింగ్, ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, బిహార్ గవర్నర్‌గా ఆరిఫ్ అహ్మద్, మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది.

Published By: HashtagU Telugu Desk
Governors

Governors

Governors: కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు గవర్నర్లను (Governors) నియమించింది. ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాను ఆమోదించారు. ఆయన రాజీనామాను దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయ‌న‌తో పాటు కొంత‌మందిని ప‌లు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌లుగా నియ‌మించారు. ఎవ‌రు.. ఎక్కడ బాధ్యతలు స్వీకరించారో తెలుసుకుందాం!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్లను నియమించారు. రఘుబర్ దాస్ రాజీనామాను ఆమోదించిన తర్వాత మిజోరాం గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటిని ఒడిశా గవర్నర్‌గా నియమించగా, జనరల్ వికె సింగ్ మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు.

బీహార్ గవర్నర్‌గా ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నియమితులయ్యారు

బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళకు పంపగా.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు బీహార్ గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. అజయ్ కుమార్ భల్లా మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్లు తమ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయి.

Also Read: GST On Old Cars : పాత కార్ల సేల్స్‌పై ఇక నుంచి జీఎస్టీ ఎలా విధిస్తారంటే..

కేరళ గవర్నర్‌గా రాజేంద్ర ఆర్లేకర్, మిజోరం గవర్నర్‌గా విజయ్‌కుమార్ సింగ్, ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, బిహార్ గవర్నర్‌గా ఆరిఫ్ అహ్మద్, మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది.

మ‌ణిపూర్‌కు గ‌వ‌ర్న‌ర్ ఎవ‌రో తెలుసా?

అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ప‌రిస్థితుల్ని చ‌క్క‌దిద్దేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి కొత్త‌ గ‌వ‌ర్న‌ర్‌గా అజ‌య్ కుమార్ భ‌ల్లాను నియ‌మించింది. గ‌తంలో కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన ఆయ‌న్ను అనూహ్యంగా తెర‌మీద‌కు తేవ‌డం అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. శాంతి భ‌ద్ర‌త‌ల అంశాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉన్న కార‌ణంగానే కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఎవరికి ఎక్కడ బాధ్యతలు అప్పగించారో చూద్దాం!

  • మిజోరం గవర్నర్ హరిబాబు ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యారు.
  • రాజేంద్ర అర్లేకర్‌ను బీహార్ నుండి తొలగించి కేరళ గవర్నర్‌గా నియమించారు.
  • మిజోరాం గవర్నర్‌గా జనరల్ వీకే సింగ్ నియమితులయ్యారు.
  • ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను కేరళ నుంచి తొలగించి బీహార్ గవర్నర్‌గా నియమించారు.
  • అజయ్ కుమార్ భల్లాకు మణిపూర్ బాధ్యతలు దక్కాయి.
  Last Updated: 25 Dec 2024, 10:19 AM IST