TTD Appeal: తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి..భక్తులకు టీటీడీ విజ్ఞ‌ప్తి !!

క‌లియుగ దైవం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి వారి భ‌క్తుల‌కు టీటీడీ శ‌నివారం ఓ విజ్ఞ‌ప్తి చేసింది.

  • Written By:
  • Publish Date - May 29, 2022 / 05:30 AM IST

క‌లియుగ దైవం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి వారి భ‌క్తుల‌కు టీటీడీ శ‌నివారం ఓ విజ్ఞ‌ప్తి చేసింది. కొద్ది రోజుల పాటు తిరుమ‌ల ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని భ‌క్తుల‌కు టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కాగా శ‌నివారం సాయంత్రానికే తిరుమ‌ల‌కు రికార్డు స్థాయిలో భ‌క్తులు చేరుకున్నారు. స‌ర్వ ద‌ర్శ‌నం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్ మెంట్ల‌న్నీ భక్తులతో నిండిపోయాయి. ఫ‌లితంగా స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు స్వామి వారి ద‌ర్శ‌నానికి ఏకంగా 48 గంట‌ల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు టీటీడీ తెలిపింది.

ఈ ప‌రిస్థితిని భ‌క్తుల‌కు వివ‌రించారు ధ‌ర్మారెడ్డి. తిరుమ‌ల‌లో ప్ర‌స్తుతం ఉన్న ర‌ద్దీ త‌గ్గేందుకు క‌నీసం 2 రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. ఆ మేర‌కు తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవాల‌ంటూ ఆయ‌న కోరారు. ఇప్ప‌టికే తిరుమ‌ల‌కు చేరుకున్న భక్తుల‌కు అన్ని ర‌కాల సౌక‌ర్యాల‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు.

మ‌రింత మంది పెరిగితే అందుక‌నుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీకి ఇబ్బందిగా మారుతుంద‌ని చెప్పారు. భారీ ర‌ద్దీతో భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌లిగే ప్ర‌మాదం ఉంద‌ని చెప్పారాయన. అదే జ‌రిగితే త‌గినంత ఏర్పాట్లు చేయ‌లేదంటూ టీటీడీపై నింద‌లేస్తార‌ని ధర్మారెడ్డి తెలిపారు.