PM Modi wishes: సోనియాజీ త్వరగా కోలుకోండి!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - June 3, 2022 / 12:14 AM IST

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. ఆమెతో పాటు మరికొంత మంది నేతలు కొవిడ్ తో బాధపడుతున్నారు. సోనియాకు కరోనా సోకడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆకాంక్షించారు. “కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ జీ కోవిడ్-19 నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు. సోనియా ఈ నెల 8న నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నప్పటికీ, కోలుకుని విచారణకు హాజరవ్వాలని సోనియా భావిస్తున్నట్టు తెలుస్తోంది.