PM Modi: ఈనెల 5న హైదరాబాద్ కు మోడీ రాక

  • Written By:
  • Updated On - February 8, 2022 / 12:13 PM IST

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఈ నెల 5 వ తేదీన హైద‌రాబాద్ కు రానున్నారు. ఈ ప‌ర్యట‌న‌లో ప్రధాని రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పటాన్​చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. కాగా ముచ్చింతల్ లో రామానుజచార్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు జరిగిన శోభయాత్రలో దాదాపు 25 వేల మంది భక్తులు పాల్గొన్నారు.