బుధవారం తెల్లవారుజామున తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విపత్తులో దాదాపు 155 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. పాక్టికా ప్రావిన్స్లో 6 తీవ్రతతో భూకంపం జరిగినట్టుగా అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బఖ్తర్ వార్తా సంస్థ ఈ వివరాలను రిపోర్ట్ చేసింది. సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్లో ప్రత్యేక టీమ్స్ అక్కడికి చేరుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనలో ఎంతోమంది గాయపడ్డారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
BREAKING: #Afghanistan state-run news agency reports at least 155 killed in #earthquake in country's eastern Paktika province. pic.twitter.com/lAWicfKMwI
— Amit Shukla (@amitshuklazee) June 22, 2022