Site icon HashtagU Telugu

100 Devotees: మహా కుంభమేళాలో 100 మంది భ‌క్తుల‌కు గుండెపోటు.. ఐసీయూలో 183 మంది!

100 Devotees

100 Devotees

100 Devotees: మహా కుంభమేళాలో గుండెపోటుకు గురైన 100 మందికి పైగా భక్తులను(100 Devotees) రక్షించగా, 183 మంది క్రిటికల్ పేషెంట్లను ఐసీయూలో ఉంచారు. 580 మైనర్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ఇది మాత్రమే కాదు ఇప్పటి వరకు 170,727 రక్త పరీక్షలు, 100,998 మంది OPDలో తమను తాము చూపించుకున్నారు. దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సెంట్రల్ హాస్పిటల్‌లో చికిత్స జరుగుతోంది.

మహాకుంభ్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ గౌరవ్ దూబే మాట్లాడుతూ.. భారతదేశం, విదేశాల నుండి వచ్చే భక్తులకు మహకుంభ్ నగర్‌లో అద్భుతమైన వైద్యసేవలు లభిస్తున్నాయన్నారు. ఇటీవలి కేసులను వెలుగులోకి తెస్తూ.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భక్తులకు ఛాతీ నొప్పి వచ్చింది. సెంట్రల్ హాస్పిటల్‌లో విజయవంతంగా చికిత్స పొందారు. ఇద్దరినీ ఐసీయూలో చేర్చి తక్షణమే చికిత్స అందించారు. ఇప్పుడు వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

Also Read: Rashmika Mandanna: ర‌ష్మికా మంద‌న్న‌.. సైలెంట్‌గా హిట్‌లు కొట్టేస్తున్న భామ‌!

ఇద్దరు రోగులకు ECG చేయడం జరిగిందని, దాని వల్ల సమర్థవంతమైన చికిత్స జరిగిందని, వారు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ దూబే చెప్పారు. ఈ కేసులే కాకుండా ఫుల్‌పూర్‌లోని హనుమాన్‌గంజ్‌కు చెందిన 105 ఏళ్ల బాబా రామ్ జైన్ దాస్ కడుపునొప్పికి సెంట్రల్ హాస్పిటల్‌లో చికిత్స పొందారని ఆయన చెప్పారు. అధునాతన వైద్య సదుపాయాలను ప్రశంసిస్తూ.. మహాకుంభ్‌లో ఇంత అద్భుతమైన ఆరోగ్య సంరక్షణను అందించినందుకు డాక్టర్ దూబే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

జనరల్ మెడిసిన్, డెంటల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, చైల్డ్ కేర్ స్పెషలిస్ట్‌లతో సహా ప్రత్యేక నిపుణుల బృందం సెంట్రల్ హాస్పిటల్‌లో ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది. తీవ్రమైన కేసుల కోసం ఆసుపత్రిలో 10 పడకల ఐసియు ఉంది. అదనంగా అధునాతన, సమర్థవంతమైన సంరక్షణను నిర్ధారించడానికి రోగులను పర్యవేక్షించడానికి AI- ఆధారిత కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నారు.

Also Read: Davos : తెలంగాణలో మరో రూ.10వేల కోట్ల పెట్టుబడులు..రేవంతా మజాకా..!