Northern Railways: ఉత్తర రైల్వే (Northern Railways) ఎలుకలను వదిలించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఎలుకను పట్టుకునేందుకు రైల్వేశాఖ రూ.41 వేలు ఖర్చు చేసిందని, అదే విధంగా మూడేళ్లలో రూ.69 లక్షలు ఖర్చు చేసిందని మీడియా కథనంలో పేర్కొంది. ఎలుకల బెడద నుండి ఉపశమనం పొందడానికి ఉత్తర రైల్వే ఎలుకలను పట్టుకోవడానికి ఒక సంవత్సరంలో 23.2 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఈ సమాచారం ఆర్టీఐ ద్వారా అందింది. ఇప్పుడు లక్నో మండల్ దీనిపై స్పందించింది.
ఇండియా టుడేలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. లక్నో డివిజన్లో పోస్ట్ చేయబడిన సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రేఖా శర్మ సమాచారం తప్పుగా సూచించబడిందని చెప్పారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ సమాచారాన్ని తప్పుగా అందించారని అన్నారు.
లక్నో డివిజన్లో తెగుళ్లు, ఎలుకలను నియంత్రించే బాధ్యత గోమతీనగర్లోని M/s సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్పై ఉందని రైల్వే తెలిపింది. కీటకాలు, ఎలుకలను నియంత్రించడం దీని ఉద్దేశ్యం. ఫ్లషింగ్, స్ప్రేయింగ్, స్టేబిలింగ్, మెయింటెనెన్స్, బొద్దింకలు వంటి చీడపీడల నుండి రైల్వే లైన్లను రక్షించడం, రైలు బోగీల్లోకి ఎలుకలు రాకుండా నిరోధించడం వంటివి ఇందులో ఉన్నాయి.
Also Read: Architect House Looted : వాస్తు నిపుణుడి ఇంట్లో రూ.4 కోట్లు లూటీ
ఈ ఖర్చు ఎలుకలను పట్టుకోవడం కోసం కాదు, ఎలుకలు పెరగకుండా నిరోధించడం అని రైల్వే తెలిపింది. ఎలుకలు, బొద్దింకల నుండి రక్షించడానికి పురుగుమందులను పిచికారీ చేయడం నుండి అనేక రకాల కార్యకలాపాలు రైళ్ల బోగీలలో చేర్చబడ్డాయి. లక్డీకాపూల్ మండల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎలుకకు రూ.41 వేలు ఖర్చు చేసిన విషయాన్ని తప్పుగా ప్రజెంట్ చేశారన్నారు.
ఎలుకలను పట్టుకోవడానికి రైల్వే ప్రతి సంవత్సరం రూ.23.2 లక్షలు ఖర్చు చేస్తుందని మీడియా నివేదికలో పేర్కొంది. అదే సమయంలో మూడేళ్లలో రూ.69 లక్షలు వెచ్చించి కేవలం 168 ఎలుకలను పట్టుకున్నారని పేర్కొంది. 25 వేల కోచ్లలో ఎలుకలను నియంత్రించేందుకు ఒక్కో బోగీకి రూ.94 ఖర్చు చేసినట్లు రైల్వే అధికారి చెబుతున్నారు. నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ 2020 నుంచి 2022 వరకు ఎలుకలను పట్టుకోవడం కోసం ఏకంగా 69.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది.
నార్నర్ రైల్వే పరిధిలో ఢిల్లీ, అంబాలా, లక్నో, ఫిరోజ్ పూర్, మొరాదాబాద్ డివిజన్లు ఉన్నాయి. ఆర్టీఐ చంద్రశేఖర్ గౌర్ నార్నర్ రైల్వే వ్యాప్తంగా సమాచారం కోరారు. ఒక్క లక్నో డివిజన్ మాత్రమే స్పష్టమైన సమాచారం ఇచ్చింది. ఎలుకల కారణంగా జరిగిన నష్టం ఎంత? అన్న గౌర్ ప్రశ్నకు లక్నో డివిజన్ కూడా సమాచారం ఇవ్వలేదు. నష్టపోయిన గూడ్స్, వస్తువులకు సంబంధించిన సమాచారం లేదని..నష్టాన్ని తాము అంచనా వేయలేదని తెలిపింది.