Aluva Child Rape: జూలై 28న కేరళలోని అలువాలో ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన అష్ఫాక్ ఆలమ్కు ఎర్నాకులం పోక్సో కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది. విచారణకు అధ్యక్షత వహించిన న్యాయమూర్తి కె.సోమన్ నవంబర్ 14న ఉదయం 11 గంటలకు తీర్పునిచ్చారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 30 రోజుల్లోనే పోలీసులు విచారణ ముగించి చార్జిషీట్ దాఖలు చేశారు. 28 ఏళ్ల ఆలమ్పై 302 (హత్య), 376 2( అత్యాచారం), 366A ( కిడ్నప్) మరియు 364 (హత్య చేయాలనే ఉద్దేశ్యంతో కిడ్నాప్ చేయడం) సహా పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది
అక్టోబర్ 4న ప్రారంభమైన విచారణ కేవలం 26 రోజుల్లోనే పూర్తయింది. ఆ చిన్నారి బీహార్కు చెందిన వలస దంపతుల కుమార్తె. ఆమె మృతదేహం జూలై 29న అలువా మార్కెట్ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో గోనె సంచులలో కనిపించింది. ఈ కేసులో 41 మంది సాక్షులను విచారించగా, 13 అభియోగాలకు ఆలం దోషిగా నిర్ధారించింది. దోషిని తీవ్రంగా శిక్షించాలని ప్రాసిక్యూషన్ డిమాండ్ చేసింది. మరణించిన బాలిక తల్లిదండ్రులు కూడా ఉరిశిక్షను కోరారు.
Also Read: KTR Praises Chandrababu: చంద్రబాబు ఫై కేటీఆర్ ప్రశంసలు..