Mask Fine: బ‌స్సుల్లో మాస్క్ పెట్టుకోవాల్సిందే.. లేకపోతే ఫైన్ ప‌డుద్ది.. !

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌టంతో అన్ని రాష్ట్రాలు అప్ర‌మ‌త్త‌మైయ్యాయి. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంది.

  • Written By:
  • Publish Date - January 10, 2022 / 09:21 AM IST

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌టంతో అన్ని రాష్ట్రాలు అప్ర‌మ‌త్త‌మైయ్యాయి. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంది. మ‌రోవైపు లాక్ డౌన్ విధించ‌కుండానే ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం భావిస్తుంది. ఈ నేప‌థ్యంలోనే ఏపీఎస్ ఆర్టీసీ క‌రోనా నిబంధ‌న‌లు మ‌ళ్లీ కఠిన‌త‌రం చేసింది. బ‌స్సుల్లో ప్ర‌యాణానికి మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేసింది. గ‌తంలో కూడా ఈ నిబంధ‌న‌ను పెట్టిన‌ప్ప‌టికీ క‌రోనా కేసులు త‌గ్గ‌డంతో ఆర్టీసీ చూసిచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించింది. తాజాగా కేసులు పెరుగుతుండ‌టంతో బ‌స్సుల్లో మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేసింది. మాస్క్ ధరించకుంటే రూ.50 జరిమానా విధిస్తుంది.