Site icon HashtagU Telugu

Nimmagadda Prasad : ఫార్మాలోకి నిమ్మగడ్డ ప్రసాద్ రీఎంట్రీ.. అమ్మేసిన కంపెనీనే మళ్లీ కొనేశారు

Nimmagadda Prasad

Nimmagadda Prasad

Nimmagadda Prasad : ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఔషధ రంగంలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఏ సంస్థనైతే 17 ఏళ్ల క్రితం అమ్మేశారో.. మళ్లీ అదే సంస్థను ఆయన కైవసం చేసుకున్నారు. ఇండియాలోని తన వ్యాపారాన్ని విక్రయించేందుకు వియాట్రిస్ అంతర్జాతీయంగా నిర్వహించిన బిడ్డింగ్‌లో నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన ఐక్వెస్ట్ ఎంటర్‌ప్రైజెస్ ప్రాధాన్య ఇన్వెస్టర్‌గా నిలిచింది. ఈ డీల్‌తో నిమ్మగడ్డ ప్రసాద్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఫార్మా రంగంలోకి అడుగు పెట్టేందుకు లైన్ క్లియర్ అయింది.  యాక్టివ్ ఫార్మా స్యూటికకల్స్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) ను వియాట్రిస్ కంపెనీ తయారు చేస్తుంటుంది.

ఒప్పందంలో భాగంగా..

నిమ్మగడ్డ ప్రసాద్, వియాట్రిస్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా వియాట్రిస్‌కు చెందిన ఆరు ఏపీఐ తయారీ యూనిట్లు (హైదరాబాద్, విశాఖపట్నంలో మూడు చొప్పున), హైదరాబాద్‌లోని ఆర్ అండ్ డీ యూనిట్ ఐక్వెస్ట్ పరం కానున్నాయి. ఈ డీల్ పూర్తి కావడానికి 6 నెలల టైం పడుతుందని అంచనా. ఆరు ప్లాంట్ల వార్షికాదాయం సుమారు రూ.6 వేల కోట్లు ఉంటుందని అంచనా. అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకే వియాట్రిస్ తమ అంతర్జాతీయ వ్యాపారాల్లోని వాటాలను విక్రయిస్తోంది. భారత్‌లో మహిళల ఆరోగ్య సేవల వ్యాపారాన్ని స్పెయిన్‌కు చెందిన ఇన్సడ్ ఫార్మాకు వియాట్రిస్ విక్రయించింది. ఐక్వెస్ట్, ఇన్సడ్ డీల్స్ ద్వారా వియాట్రిస్‌కు దాదాపు రూ. 10 వేల కోట్లు సమకూరనున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

గతంలో ఏం జరిగిందంటే.. ?

Also read : India Vs Canada : 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలుచుకోండి.. కెనడాకు భారత్ వార్నింగ్ ?