Night Curfew: జనవరి 18 నుంచి ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ!

కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జనవరి 18 నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారు.

  • Written By:
  • Updated On - January 17, 2022 / 12:15 PM IST

కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జనవరి 18 నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఆ సమయంలో ప్రజల రాకపోకలతో పాటు వాహనాల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించనున్నారు. వాస్తవానికి ఈ నెల 11 నుంచి కర్ఫ్యూ విధించాలని తొలుత భావించారు. అయితే సంక్రాంతి పండుగ దృష్ట్యా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ పూర్తిగా అమల్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.