National BJP on TRS:టీఆర్ఎస్ ధర్నాపై బీజేపీ రియాక్షన్

తెలంగాణ‌లో యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ చేప‌ట్టిన నిర‌స‌న‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం స్పందించింది.

  • Written By:
  • Updated On - April 11, 2022 / 08:52 PM IST

తెలంగాణ‌లో యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ చేప‌ట్టిన నిర‌స‌న‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం స్పందించింది. దేశంలోని ఏ ఒక్క రాష్ట్రం నుంచి కూడా పారాబాయిల్డ్ రైస్‌ను కొన‌డం లేద‌ని తేల్చి చెప్పిన కేంద్రం అందులో భాగంగానే పంజాబ్ నుంచి కూడా ఒక్క గింజ కూడా పారాబాయిల్డ్ రైస్‌ను కొన‌లేద‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కేంద్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ కార్య‌ద‌ర్శి సుధాంశు పాండే ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ప్ర‌స్తుతం ఏ రాష్ట్రం నుంచి కూడా పారాబాయిల్డ్ రైస్ తీసుకోవ‌డం లేదని, పంజాబ్ నుంచి ఒక్క గింజ కూడా బాయిల్డ్ రైస్ తీసుకోలేదని సుధాంశు పాండే తెలిపారు.

ఎఫ్‌సీఐ నేరుగా ధాన్యం సేక‌రించ‌దని, ధాన్యాన్ని మిల్లింగ్ చేసినందుకు మిల్ల‌ర్ల‌కు డ‌బ్బు చెల్లిస్తామని తెలిపిన ఆయన ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ ఒకే వాతావ‌ర‌ణ జోన్‌లో ఉన్నాయని చెప్పారు. ఏపీలో రాని స‌మస్య తెలంగాణ‌లో ఎందుకు వ‌స్తోందని, దేశంలో ఇప్ప‌టికే ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అవ‌లంబిస్తున్నామని సుధాంశు పాండే ప్ర‌క‌టించారు.