Murder : ఢిల్లీలో దారుణం.. సీఎన్‌జీ పంప్‌లో సేల్స్‌మేన్‌ని కొట్టి చంపిన దుండ‌గులు

పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్‌లో దారుణం చోటుచేసుకుంది. బుధవారం సీఎన్‌జీ పంప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న 34 ఏళ్ల

  • Written By:
  • Publish Date - March 9, 2023 / 08:48 AM IST

పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్‌లో దారుణం చోటుచేసుకుంది. బుధవారం సీఎన్‌జీ పంప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న 34 ఏళ్ల వ్యక్తి కొట్టి చంపబడ్డాడు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు స్వరూప్ నగర్ నివాసి వికాష్ చంద్రగా గుర్తించారు. ఆసుప‌త్రిలో మృతుడిని చేర్చుకునే ముందు పోలీసులకు మహారాజా అగర్సేన్ ఆసుపత్రి స‌మాచారం అందించింది. విచారణలో వికాష్ కొత్త రోహ్‌తక్ రోడ్‌లోని గోల్డెన్ పార్క్ జుగ్గి సమీపంలోని సిఎన్‌జి పంప్‌లో వికాస్ చంద్ర పనిచేస్తున్నట్లు తేలింది. డ్యూటీలో ఉండగా వికాష్ సమీపంలోని దుకాణంలో ఏదో కొనడానికి వెళ్లాడు. అక్కడ అతను జుగ్గీ నివాసితులు కరణ్, అర్జున్‌తో గొడవ పడ్డాడు. వాగ్వాదం పెరిగి వికాష్‌ను ఇద్దరూ కొట్టి చంపారు.ఈ ఘ‌ట‌న‌లో నిందితులిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.