Munugode : నేడు నామినేష‌న్ వేయ‌నున్న మునుగోడు టీఆర్ఎస్ అభ్య‌ర్థి

మునుగోడు బైపోల్ హీట్ రోజురోజుకు పెరుగుతుంది. నామినేష‌న్ గ‌డువు...

  • Written By:
  • Publish Date - October 13, 2022 / 08:24 AM IST

మునుగోడు బైపోల్ హీట్ రోజురోజుకు పెరుగుతుంది. నామినేష‌న్ గ‌డువు ముగుస్తుండ‌టంతో ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీ అభ్య‌ర్థి కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి నామినేష‌న్ వేశారు. ఈ రోజు అధికార టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ వేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీపీఎం, సీపీఐ నేత‌లు హాజ‌రుకానున్న‌రు. ఇప్ప‌టికే కూసుకుంట్ల త‌రుపున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు.