Rahul Gandhi: విపక్షాలను మోదీ ప్రభుత్వం టార్గెట్‌ చేస్తోంది : రాహుల్ గాంధీ

  • Written By:
  • Updated On - March 18, 2024 / 07:18 PM IST

 Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ఓ అసమర్థ నేత అని, ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ లేకుండా లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గడం ఆయన తరం కాదని వ్యాఖ్యానించారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు సందర్భంగా ముంబైలో జరిగిన బహిరంగ ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు.తాము ఓ శక్తితో పోరాడుతున్నామని అన్నారు. ఈవీఎం, దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖలను అడ్డం పెట్టుకొని విపక్షాలను మోదీ ప్రభుత్వం టార్గెట్‌ చేస్తోందని ఆరోపించారు.

మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్‌ నేత కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవడానికి పార్టీ మారారని అన్నారు. తాను పేర్లు చెప్పదలుచుకోలేదని మహరాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నాయకుడు కాంగ్రెస్‌ను విడిచిపెట్టారని అన్నారు.ఆయన ఏడుస్తూ తన తల్లి సోనియా గాంధీకి ఫోన్‌ చేసినట్లు చెప్పారు. ‘సోనియాజీ.. ఆ శక్తితో పోరాడే శక్తి నాకు లేదు. నేను జైలుకు వెళ్లాలనుకోవడం లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా అనిపిస్తోంది’ అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారని రాహుల్‌ అన్నారు.