MLC Kavitha: ఇవాళ చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు చెన్నైలో పర్యటించనున్నారు.

  • Written By:
  • Updated On - October 12, 2023 / 11:50 AM IST

MLC Kavitha: హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు చెన్నైలో పర్యటించనున్నారు. ఏబీపీ నెట్వర్క్ సంస్థ నిర్వహించనున్న “ద సదరన్ రైసింగ్ సమ్మిట్”లో పాల్గొంటారు. సమ్మిట్ లో “సార్వత్రిక ఎన్నికలు 2024: ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు ?” అనే అంశంపై గురువారం నాడు రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి జరిగే చర్చ వేదికలో పాలుపంచుకుంటారు. కవిత తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఈ అంశంపై జరిగే చర్చలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నమలై పాల్గొంటారు. ఈ చర్చా వేదికకు ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.