ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్లో ఎమ్మెల్సీ కవిత పేరు ఈడీ వెల్లడించింది. ఈడీ రిమాండ్ రిపోర్ట్పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కవిత ఇంటి దగ్గర భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. జగిత్యాల టూర్కి బయల్దేరుతున్న కవితకు కార్యకర్తలు, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, భానుప్రసాద్లు సంఘీభావం తెలిపారు. కార్యకర్తల మధ్యలోనే ఆమె మీడియాతో మాట్లాడారు. తాను దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కోంటానని తెలిపారు.
ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో సంవత్సరం ముందు మోడీ కంటే ఈడీ ముందు వస్తాయని ఆమె ఆరోపించారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయని.. అందుకే రాజకీయంగా తమపై కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసులు పెట్టారని.. జైలుకు పోయేందకు సిద్ధంగా ఉన్నాం కానీ భయపడే ప్రసక్తే లేదని కవిత తెలిపారు.