కాకినాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ను మరో 15 రోజులు పొడిగిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ గడువు నేటితో ముగియడంతో సెంట్రల్ జైలు నుంచి పోలీసులు ఎస్కార్ట్ సాయంతో తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ్ను పొడిగించి తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. ఈనెల 23 నుంచి జైలులో రిమాండ్లో ఉన్న అనంతబాబు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.