Mimoh Chakraborty: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ హీరో కుమారుడు.. ఎవరో తెలుసా

మిమో చక్రవర్తి ఇద్దరూ జర్నలిస్ట్ పాత్రల్లో కనిపిస్తారు.

  • Written By:
  • Updated On - October 16, 2023 / 06:03 PM IST

Mimoh Chakraborty: సీనియర్ హిందీ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు  పరిచయం అవుతున్న సినిమా ‘నేనెక్కడున్నా’. మాధవ్ కోదాడ దర్శకత్వం వహించారు. ఆయనకూ తొలి చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో సినిమా రూపొందింది. ఈ చిత్రంలో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్ 17న థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు.

దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ ”జర్నలిజం & పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కించిన  సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సశా ఛెత్రి , మిమో చక్రవర్తి ఇద్దరూ జర్నలిస్ట్ పాత్రల్లో కనిపిస్తారు. మొదటి నుంచి చివరివరకు ప్రేక్షకుల ఊహకు అందని మలుపులతో  ఉత్కంఠభరితంగా సినిమా సాగుతుంది. స్త్రీలకు బాగా కనెక్ట్ అయ్యే విమెన్ ఓరియెంటెడ్ సినిమా ఇది . దాంతోపాటు జర్నలిజంపై  రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుందనేది  సినిమాలో చూపించాం ” అన్నారు.

చిత్ర నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ”సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశాం. ముంబై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో చిత్రీకరణ చేశాం. స్టోరీ , మ్యూజిక్, విజువల్స్, డైరెక్షన్ మా సినిమాకు బలం. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో రష్యన్ బెల్లీ డాన్సర్లతో చేసిన పబ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నవంబర్ 17న తెలుగు , హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల అవుతోంది ” అని చెప్పారు.