AP Trains: ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్, 144 రైళ్లు రద్దు

  • Written By:
  • Publish Date - December 3, 2023 / 09:48 AM IST

AP Trains: మిచాంగ్ తుఫాను దృష్ట్యా ఏపీలో భారీ వర్షాలు, ఈదురుగాలుల వీచే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అలర్ట్ కాగా, తాజాగా రైల్వే శాఖ అలర్ట్ అయ్యింది. ఈ కారణంగా తీరప్రాంతాల గుండా వెళ్లాల్సిన 144 రైళ్లను రైల్వే రద్దు చేసింది. ఆయా రైళ్ల లభ్యతను పరిశీలించిన తర్వాతే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రద్దు చేయబడిన 144 రైళ్లు డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 7 వరకు షెడ్యూల్ చేయబడ్డాయి. రద్దు చేయబడిన రైళ్ల వివరాలు అన్ని రైల్వే స్టేషన్లలో మరియు రైల్వే వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సంబంధిత రైల్వే స్టేషన్‌ల విచారణ నంబర్‌లకు కూడా కాల్ చేయవచ్చు.

Also Read: TS Elections: ఓట్ల లెక్కింపులో దూసుకుపోతున్న కాంగ్రెస్, 60 స్థానాలతో ముందంజ