Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ‘మసూద’ మూవీ టీం!

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశాంత్ నగర్ లో మసుధ మూవీ టీం మొక్కలు

  • Written By:
  • Updated On - November 12, 2022 / 05:43 PM IST

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశాంత్ నగర్ లో మసుధ మూవీ టీం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటి, నటులు తిరువీర్, కావ్య, భాంధవి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. నవంబర్ 18 న మసుధ మూవీ రిలీజ్ అవుతున్న సందర్బంగా అందరం కలిసి మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొనడం ఒక పండగ వాతావరణం లా అనిపించింది అన్నారు.

మంచి ఆక్సీజన్ కావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. సందర్బం ఏది అయినా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అన్నారు. సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఇంకా ఎన్నో మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమం లో ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్, డైరెక్టర్ సాయి కిరణ్ పలువురు పాల్గొన్నారు.