ప్రముఖ ఆటో రంగ దిగ్గజం…మారుతీ తన ప్రసిద్ధ MUV సుజుకి ఎర్టిగా ఫేస్ లిస్టు వెర్షన్ను శుక్రవారంలో భారత్ లో రిలీజ్ చేయనుంది. థర్డ్ జనరేషన్ లో మూడు వరుసల ఏడు సీట్ల MPVకొత్త లేటెస్టు ఫీచర్లతో వస్తుంది. హ్యుందాయ్ అల్కాజర్ మార్కెట్లో కియా కేరెన్స్ తో ఇది పోటీపడుతుంది. 2022ఎర్టిగా ఫేస్ లిస్టు కాకుండా మారుతీ ప్రీమియం ఫీచర్స్ తో 2022XL6 సిక్స్ సీటర్ MPVని కూడా అందిస్తుంది. 2012లో మొదటిసారిగా ప్రారంభించిన మారుతీ సుజుకీ గత పదిసంవత్సరాలుగా దేశంలో ఏడు లక్షల యూనిట్లకు పైగా ఎర్టిగా కార్లను విక్రయించింది. కంపెనీ అమర్చిన CNGని ప్రారంభించడంతో ఎర్డిగా కారుకు డిమాండ్ భారీగా పెరిగింది.
మారుతీ సుజుకీ కొత్త ఎర్టిగాను నాలుగు ట్రిమ్ లలో అందించనుంది. వీటిలో LX1, VXI, ZXI, ZXI+ వేరియంట్స్ ఉన్నాయి. కొత్త ఎర్టిగా పెరల్ ఆర్కిటిక్ వైట్, స్ల్పెండిడ్ సిల్వర్, పెరల్ డిగ్నిటీ బ్రౌన్, మాగ్మా గ్రే, ఆబర్న్ రెడ్, ప్రైమ్ ఆక్స్ ఫర్డ్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ మొత్తం ఏడు రంగుల్లో అందుబాటులోకి రానుంది.
ఈ కార్లతో పోటీ పడునుంది:
టయోటా ఇన్నోవా క్రిస్టాకు చాలా ఆదరణ ఉంది. అయినప్పటికీ మారుతీ ఎర్టిగా XL6 ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిల్లో ఒకటి. అయితే ఇది హ్యాందాయ్ అల్కాజార్, కియా కారెన్స్ వంటి కొత్త మూడు వరుసల కార్లతో పోటీపడుతుంది. ఎర్టిగా ధర రూ. 9.29లక్షల నుంచి 12.68 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది ఈ ధర విభాగంలో మహీంద్రా మరాజో, రెనాల్ట్ ట్రైబర్ MPVలకు పోటీగా ఉంది.
మారుతీ ఎర్టిగా ధర:
మారుతీ ఎర్టిగా MPV ప్రస్తుతం భారత మార్కెట్లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో విక్రయించబడుతోంది. ఇది CNG వెర్షన్ తో కూడా రానుంది. ఎర్టిగా ధర ప్రస్తుతం రూ. 9.29లక్షల నుంచి 12.68 లక్షల మధ్య ఉంది. మారుతీ కొత్త ఎర్టిగాకు కొత్త ఇంజన్, కొత్త ట్రాన్స్ మిషన్, కొత్త టెక్నాలజీని యాడ్ చేసింది. అందుకే MPV ధర పాత మోడల్స్ కుంటే కొంచెం ధర ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.
