T Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కీల‌క ప‌రిణామం.. కొత్త ఇంఛార్జ్‌ని నియ‌మించిన ఏఐసీసీ

తెలంగాణ కాంగ్రెస్‌లో గ‌త కొద్ది రోజులుగా ఉన్న సంక్షోభానికి అధిష్టాన్ని చెక్ పెడుతుంది. సీనియ‌ర్లు ఇప్ప‌టికే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు

  • Written By:
  • Publish Date - January 5, 2023 / 06:33 AM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో గ‌త కొద్ది రోజులుగా ఉన్న సంక్షోభానికి అధిష్టాన్ని చెక్ పెడుతుంది. సీనియ‌ర్లు ఇప్ప‌టికే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌టంతో అధిష్టానం వారికి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది. దీనితో పాటు ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్‌ని మార్చాలంటూ చాలా మంది సీనియ‌ర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేయ‌డంతో నివేదిక‌ల‌ను ప‌రిశీలించిన త‌రువాత ఇంఛార్జ్ ఠాకూర్‌ని త‌ప్పించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తెలంగాణ కొత్త పార్టీ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌రావ్‌ ఠాక్రేను నియమించారు. ప్రస్తుతం మాణికం ఠాగూర్‌ను గోవాకు బదిలీ చేశారు. మాణిక్‌రావు ఠాక్రేను తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారని.. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ తెలిపారు. ఠాక్రే మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడిగా ఉన్నారు.