Bear Attack: యల్లారెడ్డిపేట మండలం గుంటపలిచెరువు తండాలో ఎలుగుబంటి దాడి చేయడంతో గొర్రెల కాపరి గాయపడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గొర్రెల కాపరి గుగులోత్ రవి తన గొర్రెల మందతో కలిసి సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లాడు. పక్కనే ఉన్న అడవిలోంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి రవిపై దాడి చేసింది. రవి తప్పించుకుని గ్రామంలోకి పరుగులు తీయగా, కుటుంబ సభ్యులు అతడిని యల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఎలుగుబంటి దాడి గురించి తెలియడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. రవిపై దాడి చేసినప్పుడు ఎలుగుబంటికి రెండు పిల్లలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటి కదలికలపై నిఘా పెట్టారు.
Also Read: Telangana: బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్