Minor Girl Rape Case :హైద‌రాబాద్‌లో దారుణం.. అనాథాశ్రమంలో మైనర్ బాలికపై…?

హైదరాబాద్‌లో దారుణం జ‌రిగింది. జేజే నగర్‌లోని రెస్క్యూ హోమ్ కమ్-అనాథాశ్రమంలో మైనర్ బాలికను బెదిరించి...

  • Written By:
  • Updated On - October 27, 2022 / 09:58 AM IST

హైదరాబాద్‌లో దారుణం జ‌రిగింది. జేజే నగర్‌లోని రెస్క్యూ హోమ్ కమ్-అనాథాశ్రమంలో మైనర్ బాలికను బెదిరించి అత్యాచారం చేసిన ఆరోపణలపై నేరేడ్‌మెట్ పోలీసులు బుధవారం ముర‌ళీకుమార్ అనే వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. అదే సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న మురళీకుమార్ (30) అనే అరెస్టయిన వ్యక్తి గత కొన్ని రోజులుగా ఆ ప్రాంగణంలో బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలిపై లైంగిక దాడికి ప్రయత్నించాడని.. ఆమె ప్రతిఘటించడంతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని తెలిపారు. చాలా రోజుల తర్వాత అనాథాశ్రమానికి చెందిన నలుగురు బాలికలు తప్పించుకుని, మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ చేశారు. ఆ తర్వాత బాలికలు తమకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టారు. బాల‌క‌లు చేసిన ఫిర్యాదు మేరకు నేరేడ్‌మెట్‌ పోలీసులు కేసు నమోదు చేసి మురళిని అరెస్టు చేశారు.