Mallikarjun Kharge : కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం గుజ‌రాత్ చేరుకున్న ఖ‌ర్గే

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే నేటి నుంచి అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నున్నారు

  • Written By:
  • Publish Date - October 7, 2022 / 07:42 AM IST

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే నేటి నుంచి అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆయన రేపు సబర్మతి ఆశ్రమం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యాలయాన్ని సందర్శించనున్నారు. సెప్టెంబర్ 30న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు ముగియగా, అక్టోబర్ 19న ఫలితాలు వెల్లడికానున్నాయి.