హైదరాబాద్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 9 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన చిలకలగూడ ప్రాంతం జరిగింది. మెట్టుగూడ డివిజన్ దూద్ బావి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో ఇంటిలోని ఒక భాగం కూలిపోగా, సమీపంలోని నివాస నిర్మాణాలు కూడా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానికుల సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.