Arvind Kejriwal : ఢిల్లీలో శాంతిభద్రతలపై మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో శాంతిభద్రతలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని అన్నారు. ఢిల్లీలో పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు , విద్యుత్ను బాగు చేసే బాధ్యతను మేము నిర్వర్తించామని, అయితే ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా నిర్వహించడం లేదని ఆయన అన్నారు. ఢిల్లీలో హత్యలు, బాంబు పేలుళ్లు జరుగుతున్నాయన్నారు. రోడ్డుపై చేతిలో మొబైల్ తీసుకెళ్లడం కష్టమని ఓ న్యాయవాది చెప్పడం ఇప్పుడిప్పుడే చూస్తున్నామన్నారు. మీరు మీ మొబైల్ ఫోన్ తీసుకొని రోడ్డపైకి వెళ్లే పరిస్థితి లేదని.. అలా వెళితే.. మీ మొబైల్ను ఎవరో లాక్కుంటారు. ఈ ఒక్క వార్తాపత్రిక తెచ్చాను. ఢిల్లీ శాంతిభద్రతలకు సంబంధించిన సమాచారం అందులో ఉందంటూ ఓ దినపత్రికకు చూపించారు కేజ్రీవాల్.
Diksha Divas Sabha : కేసీఆర్ అనేది పేరు కాదు.. తెలంగాణ పోరు: కేటీఆర్
ఢిల్లీలో డజన్ల కొద్దీ ముఠాలు చురుగ్గా ఉన్నాయి: కేజ్రీవాల్
ఢిల్లీలో గ్యాంగ్ వార్ మొదలైందని అన్నారు. ఈ లారెన్స్ బిష్ణోయ్ ఎవరు? జైల్లో కూర్చుని ముఠాను ఎలా నడుపుతున్నాడు? ఈ విషయం అమిత్ షానే చెప్పాలి. బిష్ణోయ్ గ్యాంగ్, భౌ గ్రాండ్, గోగి గ్యాంగ్.. ఇలా డజన్ల కొద్దీ గ్యాంగ్లు ఢిల్లీలో యాక్టివ్గా ఉన్నాయి. తమ ప్రాంతాలను విభజించుకున్నారని ఎవరో చెప్పారన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి నేడు అందరూ భయపడే విధంగా తయారైంది. ప్రజలు ఈ పరిస్థితి నుంచి బయట పడాలని కోరుకుంటున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ భీభత్సం సృష్టించింది. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్లోని బిజెపి పాలిత సబర్మతి జైలులో ఉన్నారు, కాబట్టి అతను జైలులో ఉన్నప్పుడు తన ముఠాను ఎలా నడుపుతున్నాడు? అని కేజ్రీవాల్ అన్నారు.
మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రతి 20,000 కుటుంబాల్లో 1832 కుటుంబాలు నేరాలకు గురవుతున్నాయని చెప్పారు. అంటే, ఢిల్లీ కుటుంబాల్లో దాదాపు 10% మంది నేరాలకు గురవుతున్నారన్నారు. అయితే.. ఈ క్రమంలోనే.. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై బీజేపీ నేత విజేంద్ర గుప్తా దాడి అంశాన్ని లేవనెత్తడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల తర్వాత విపక్ష ఎమ్మెల్యేలు కూడా రభస సృష్టించారు. విజేంద్ర గుప్తాతో పాటు ఇతర ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీ స్పీకర్ మార్షల్ చేశారు. ఆయన చెప్పినవన్నీ సభ నుంచి బహిష్కరించారు. అనంతరం సభా కార్యక్రమాలు బుధవారానికి వాయిదా పడ్డాయి.
kakinada : బియ్యం యదేచ్చగా తరలిపోతుంటే ఏం చేస్తున్నారు?..మీకు బాధ్యత లేదా?.. పవన్ కళ్యాణ్