KCR Cup: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘కేసీఆర్ కప్’

ఉద్యమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరగనుంది.

  • Written By:
  • Publish Date - February 13, 2022 / 05:34 PM IST

ఉద్యమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరగనుంది. సీఎం కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో మహిళలు, పురుషుల విభాగంలో వాలీబాల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ లో మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు లక్ష రూపాయలు, రెండు, మూడవ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.50 వేలు, రూ.25 వేల నగదు బహుమతిని అందించనున్నారు.

15,16,17 తేదీల్లో సేవా కార్యక్రమాలకు కేటీఆర్ పిలుపు

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కెసిఆర్ గారి జన్మదిన వేడుకలను ఈసారి మూడు రోజులపాటు ఒక సంబరంగా జరుపుకుందామని కేటీఆర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.